రేవంత్ ఇంటి నుంచి మూడు సూట్ కేసులతో.....?

Update: 2018-09-29 02:05 GMT

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. శనివారం తెల్లవారుఝామున వరకూ ఈ సోదాలు కొనసాగించిన అధికారులు రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత నుంచి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకుని వెళ్లిపోయారు. రేవంత్ ఇంట్లో సోదాల సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు 20 కోట్ల మేరకు లెక్క చూపని ఆస్తులు ఈ సోదాల్లో కనుగొన్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల 3వ తేదీన ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో రేవంత్ రెడ్డిని హాజరుకావాల్సిందిగా అధికారులు నోటీసు జారీ చేశారు. దాదాపు మూడు సూట్ కేసుల్లో రేవంత్ రెడ్డి ఇంటి నుంచి పత్రాలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు.

Similar News