రేవంత్ ఆస్తుల వెనక చంద్రబాబు

Update: 2018-09-28 06:52 GMT

రేవంత్ రెడ్డి ఆస్తులన్నీచంద్రబాబు బినామీయేనని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికపోయిన రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబును కూడా విచారించాలన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు అండదండలతోనే ఆస్తులన్నీ సంపాదించారన్నారు. ఆ ఆస్తులన్నీఎక్కడి నుంచి వచ్చాయో ఐటీ అధికారులు బయటపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసును కూడా వెంటనే చేపట్టి చంద్రబాబును కూడా విచారించాలని భూమన డిమాండ్ చేశారు. ఐటీ అధికారులకు చంద్రబాబునాయుడు ఆస్తులు కన్పించడం లేదా? అని భూమన ప్రశ్నించారు.

Similar News