ఏపీలో మరో రెండు చోట్ల రీపోలింగ్..!

చంద్రగిరి నియోజకవర్గంలోని మరో రెండు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే నియోజకవర్గంలోని కమ్మపల్లి, ఎస్ఆర్ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, వెంకట్రామపురం, కొత్త [more]

Update: 2019-05-18 07:52 GMT

చంద్రగిరి నియోజకవర్గంలోని మరో రెండు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే నియోజకవర్గంలోని కమ్మపల్లి, ఎస్ఆర్ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, వెంకట్రామపురం, కొత్త కండ్రిగ నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరిపేందుకు ఈసీ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాలూరు, కుప్పం బాదూరులోనూ రీపోలింగ్ జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈసీ మొదట ప్రకటించిన రీపోలింగ్ కేంద్రాలు వైసీపీ కోరినవి కాగా, ఇప్పుడు రీపోలింగ్ జరపాలని నిర్ణయించిన రెండు పోలింగ్ బూత్ లు తెలుగుదేశం పార్టీ కోరినవి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ కోసం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ బూత్ వద్ద 250 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News