రాయపాటి ఆస్తులు వేలానికి సిద్ధం

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరొక చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసును ఎదుర్కొంటున్న రాయపాటి సాంబశివరావు మరొక సమస్య వచ్చి పడింది. సాంబశివరావు [more]

Update: 2020-07-25 12:54 GMT

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరొక చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసును ఎదుర్కొంటున్న రాయపాటి సాంబశివరావు మరొక సమస్య వచ్చి పడింది. సాంబశివరావు కు సంబంధించిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఆస్తులను వేలం వేస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేశాయి. బిడ్డింగ్ లను కూడా ఆహ్వానించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల వరకు బకాయి పడ్డాడు. దీనికి సంబంధించిన ఆస్తులని ట్రాన్స్ ట్రాయ్ ఆస్తుల్ని తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్ లిస్ట్ లో పడిపోయింది. అయితే ట్రాన్స్ ట్రాయ్ ఆస్తులను వేలానికి పెట్టినట్టుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

Tags:    

Similar News