బందీ రాకేష్ సింగ్ విడుదల

మావోయిస్టుల చేతిలో బందీగా ఉన్న రాకేష్ కుమార్ సింగ్ ను వదిలిపెట్టారు. ఎర్రం అటవీ ప్రాంతంలో రాకేష్ ని వదిలి వదిలి పెట్టారు. జీరం గూడెం వద్ద [more]

Update: 2021-04-09 00:55 GMT

మావోయిస్టుల చేతిలో బందీగా ఉన్న రాకేష్ కుమార్ సింగ్ ను వదిలిపెట్టారు. ఎర్రం అటవీ ప్రాంతంలో రాకేష్ ని వదిలి వదిలి పెట్టారు. జీరం గూడెం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో 22మంది జవాన్లు మృతి చెందారు. ఈ సందర్భంలో జవాన్ రాకేష్ సింగ్ ను మావోయిస్టులు బందీగా చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్ కు చెందిన రాకేష్ సింగ్ ను వదిలిపెట్టాలంటూ కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నేరుగా కుటుంబ సభ్యులు కోరారు. మధ్యవర్తులను ప్రకటిస్తే తమ దగ్గర బందీగా ఉన్న రాకేష్ సింగ్ ను వదిలిపెడతామని మావోయిస్టులు చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి , ఇటు పౌర సంఘాల నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు.

Tags:    

Similar News