ఏపీలో పార్టీపై రాహుల్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. ఏపీలో పార్టీని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పీసీసీని సమూలంగా ప్రక్షాళన [more]

Update: 2021-07-29 07:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. ఏపీలో పార్టీని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పీసీసీని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ వచ్చే నెలలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు టి.సుబ్బరామిరెడ్డి, పల్లంరాజు, చింతామోహన్, కనుమూరి బాపిరాజు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏపీలో కాంగ్రెస్ నిలదొక్కుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ గాంధీ చర్చిస్తారు

Tags:    

Similar News