మరోసారి రఘురామ కృష్ణంరాజు వైసీపీపై

మరోసారి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ నేతలపై విమర్శలకు దిగారు. ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమేయం ఉండకపోవచ్చని, అయితే ట్యాపింగ్ కు [more]

Update: 2020-08-17 13:22 GMT

మరోసారి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ నేతలపై విమర్శలకు దిగారు. ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమేయం ఉండకపోవచ్చని, అయితే ట్యాపింగ్ కు పాల్పడిన వ్యక్తులు ఎవరో తేల్చాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. తనను ఎవరో బెదిరిస్తున్నారో తెలుసునని, వారి వెనక ఎవరు ఉన్నారో తెలుసునని ఆయన పరోక్షంగా విజయసాయిరెడ్డి పై విరుచుకుపడ్డారు. పార్క్ హయత్ హోటల్ లో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి భేటీ సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు స్పష్టమయిందన్నారు. ఫేస్ టైమ్ లో మాట్లాడిన ఆ బాస్ ఎవరని అప్పట్లో విజయసాయిరెడ్డి ప్రశ్నించిన విషయాన్ని కూడా రఘురామ కృష‌్ణంరాజు గుర్తు చేశారు

Tags:    

Similar News