మళ్లీ కాంట్రవర్సీ ఎంపీ?

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష‌్ణంరాజు మరోసారి వివాదాల్లోకి వచ్చారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. వైసీపీ ఎంపీలు తమతో టచ్ [more]

Update: 2019-11-26 01:21 GMT

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష‌్ణంరాజు మరోసారి వివాదాల్లోకి వచ్చారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని సుజనా చౌదరి వ్యాఖ్యలు చేసి గంటలు గడవక ముందే రఘురామకృష్ణంరాజు మళ్లీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో దర్శనమివ్వడం కలకలం రేపింది. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలసి వివరణ ఇచ్చుకున్న రఘురామ కృష్ణంరాజు మళ్లీ వైసీపీ అగ్రనేతలకు చెప్పకుండా వేరొక పార్టీలోకి వెళ్లడంపై వైసీపీ నేతలు గుర్రుమంటున్నారు. అయితే రఘురామ కృష్ణంరాజు మాత్రం తనకు ఢిల్లీలో ఇల్లు కేటాయించకపోవడంపై హౌస్ కమిటీ ఛైర్మన్ తో చర్చించడానికే వెళ్లానని చెబుతున్నారు. మొత్తం మీద వైసీీపీలో ఈ కాంట్రవర్సీ ఎంపీ రోజూ ఏదో తలనొప్పి తెచ్చిపెడుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News