మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి.. జగన్ కు రాజు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు కూడా మరో లేఖ రాశారు. జస్టిస్ కనగరాజ్ ను పోలీస్ [more]

Update: 2021-06-24 04:09 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు కూడా మరో లేఖ రాశారు. జస్టిస్ కనగరాజ్ ను పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 65 ఏళ్ల లోపు వయసు ఉన్న వారే ఈ పదవికి అర్హులని రఘురామ కృష్ణరాజు లేఖలో తెలిపారు. జస్టిస్ కనగరాజ్ ను పీసీఏ ఛైర్మన్ గా నియమించడానికి నిబంధన 4 ఏను సవరించారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఈ నిర్ణయంపై పునస్పమీక్షించాలని రఘురామ కృష్ణరాజు జగన్ ను తన లేఖలో కోరారు.

Tags:    

Similar News