ఈరోజు సుప్రీంకోర్టులో చెప్పండి చూద్దాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు మరో లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా అన్నీ [more]

Update: 2021-06-23 03:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు మరో లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా అన్నీ పరీక్షలు రద్దయ్యాయని, ఈ నెల1న పరీక్షల రద్దుపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని ఆయన తన లేఖలో తెలిపారు. అన్ని రాష్ట్రాలూ బోర్డు పరీక్షలు రద్దు చేశాయని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల రద్దుపై నానుస్తుందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. విద్యార్థులను వత్తిడికి గురి చేయవద్దని, వారి ప్రాణాలను బలి పెట్టకుండా ఈరోజు పరీక్షల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కు తెలపాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

Tags:    

Similar News