చూసుకుందామంటే చూసుకుందాం.. తేల్చుకుందాం

ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. మంత్రి పేర్ని నానితో సహా తనను అందరూ విమర్శించే [more]

Update: 2020-06-16 12:49 GMT

ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. మంత్రి పేర్ని నానితో సహా తనను అందరూ విమర్శించే వారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కొట్టు సత్యనారాయణ ఒక ఇసుక దొంగ అని అన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇసుక అక్రమాలు చేశారన్నారు. కొట్టు సత్యనారాయణ జాతకం ఇప్పుడు బయటపడుతుంది. సత్యనారాయణ గురించి ఆయన మేనల్లుడే చెబుతారన్నారు. ఎవరైనా తనను విమర్శిస్తే బీ కేర్ ఫుల్ అని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. జగన్ బొమ్మ పెట్టుకుని ఎవరు గెలిచారో? నా బొమ్మ పెట్టుకుని ఎవరు గెలిచారో తేల్చుకుందామన్నారు. చూసుకుందామంటే చూసుకుందామని రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. సింహమే సింగిల్ గా వస్తుందని, పందులే గుంపులుగా వస్తాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Tags:    

Similar News