జగన్ నుంచి ప్రాణహాని ఉంది… ప్రధానికి లేఖ

ముఖ్యమంత్రి జగన్ బెయిల్ షరతులు సడలించిన తోపాటు కేసు విచారణ తొందరగా చేపట్టాలంటూ వైసీపీ ఎంపీ వేసిన పిటిషన్ ను కోర్టు కి పంపింది. సరైన పత్రాలు [more]

Update: 2021-04-08 01:27 GMT

ముఖ్యమంత్రి జగన్ బెయిల్ షరతులు సడలించిన తోపాటు కేసు విచారణ తొందరగా చేపట్టాలంటూ వైసీపీ ఎంపీ వేసిన పిటిషన్ ను కోర్టు కి పంపింది. సరైన పత్రాలు లేకపోవడంతో సిబిఐ కోర్టు రఘురామకృష్ణంరాజు పిటిషన్ ను పంపింది. దీని నుంచి తేరుకోకముందే రఘురామకృష్ణంరాజు మరో వివాదానికి తెరలేపారు. ముఖ్యమంత్రి జగన్ తో తనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా ప్రధానమంత్రి మొరపెట్టుకున్నాడు . ఇందుకు సంబంధించి ప్రధానమంత్రికి రాసిన లేఖను మీడియాకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసిపి పార్టీ పై గత కొన్ని రోజుల నుంచి విమర్శలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వైయస్ జగన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రధానమంత్రి మోడీ కి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక లేఖ రాశాడు. అయితే దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News