మరో దందా కోసమే జగన్ కొత్త పథకం

మరో భూ దందా కోసమే కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తక్కువ ధరకు ఇళ్ల పట్టాలు ఇస్తామని [more]

Update: 2021-04-01 01:10 GMT

మరో భూ దందా కోసమే కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తక్కువ ధరకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే నని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రాల్లో లే అవుట్ లు వేసి అభివృద్ధి చేస్తామని చెప్పడంలో వేరే కోణం ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ దందా కోణాన్ని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Tags:    

Similar News