ఆ విషయంపై... జగన్ నే నేరుగా అడిగా...

Update: 2018-07-31 07:57 GMT

తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ కలిశారు. జగన్ తో పలు అంశాలు ఆయన చర్చించారు. అనంతరం పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ... కాపుల రిజర్వేషన్లపై తమ లీడర్ జగన్ నే నేరుగా అడిగినట్లు తెలిపారు. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని జగన్ చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధితో ఉన్నామని వైఎస్ జగన్ అన్నట్లు తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా చిత్తశుద్ధితో కాపులకు రిజర్వేషన్ల కోసం పనిచేస్తామని జగన్ చెప్పినట్లు తెలిపారు. జగన్ మాటలు విన్నాక ఎన్ని గాలి మాటలను ప్రచారం చేస్తున్నారో అర్థమయ్యిందని చెప్పారు. ఐదేళ్లలో కాపుల సంక్షేమానికి 10 వేల కోట్లు ఇస్తామనడం చారిత్రకమని అన్నారు. జగన్ మాటిస్తే ఆ మాట తప్పరని స్పష్టం చేశారు.

Similar News