కోడెల మృతదేహంతో చంద్రబాబు

ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ భౌతిక కాయాన్ని బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కు తరలించారు. ఇవ్వాళ రాత్రికి పార్థీవదేహం ఇక్కడే ఉంటుంది. కోడెలకు నివాళులు [more]

Update: 2019-09-16 13:14 GMT

ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ భౌతిక కాయాన్ని బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కు తరలించారు. ఇవ్వాళ రాత్రికి పార్థీవదేహం ఇక్కడే ఉంటుంది. కోడెలకు నివాళులు అర్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ లు విజయవాడ నుంచి బయలుదేరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత వీరు కోడెలకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం పార్ధీవదేహం ఈ రోజు భవన్ లోనే ఉంటుంది. రేపు పార్టీ కార్యాలయం నుంచి నేరుగా గుంటూరు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు కోడెల భౌతికకాయం వెంట వెళతారు. రోడ్డు మార్గం ద్వారా కోడెల భౌతిక కాయాన్ని గుంటూరుకు తీసుకెళ్లనున్నారు. రేపు సాయంత్రం వరకూ కోడెల భౌతిక కాయం గుంటూరు పార్టీ కార్యాలయంలోనే ఉంచుతారు. ఆ తర్వాత నరసరావుపేటకు తీసుకెళతారు. బుధవారం కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

 

Tags:    

Similar News