మాయావతితో పవన్ భేటి వెనుక....?

Update: 2018-10-24 06:09 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జాతీయ స్థాయికి చేరుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీఎస్సీ అధినేత్రి మాయావతిని కలవనున్నారు. ఈ మేరకు పార్టీలో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో కలసి లక్నో వెళ్లారు. వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలోబలంలేని జనసేనకు మాయావతి తోడు అవసరమనిపించింది. దీంతో దళిత ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు పవన్ కల్యాణ్ మాయావతితో భేటీ కానున్నారు. ఏపీ రాజకీయాంశాలనే ఈ సమావేశంలో పవన్ మాయావతితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నేతలను కూడా పవన్ కలిసే అవకాశముందని జనసేన వర్గాలు వెల్లడించాయి.

Similar News