తాను బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని

Update: 2018-07-07 15:30 GMT

గ‌త ఎన్నిక‌ల్లో తాను ఎంత‌గా మ‌ద్ద‌తు ఇచ్చానో...అంతే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని అని తెలుగుదేశం పార్టీ గుర్తించుకోవాల‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. శ‌నివారం విశాఖ‌ప‌ట్నంలో జ‌న‌సేన పార్టీ నిర‌స‌న క‌వాతు జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద‌సంఖ్య‌లో ప‌వ‌న్ అభిమానులు, ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ...గురువు, దైవం లాంటి త‌న అన్న‌ను కాద‌ని గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చినందున రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా దోచుకుంటున్నార‌ని, ఉత్త‌రాంధ్ర‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. తాను ఎంత‌టి పోరాటానికైనా సిద్ధ‌మేన‌ని, టీడీపీ వాళ్ల‌కు పోగొట్టుకోవ‌డానికి వేల కోట్లు ఉన్నాయ‌ని, కానీ, త‌న వ‌ద్ద పోగొట్టుకోవ‌డానికి ఒంటి మీద బ‌ట్ట‌లు త‌ప్ప వేరేవి ఏమీ లేవ‌ని పేర్కొన్నారు.

Similar News