ఆంధ్ర ప్రజలను దేశస్థాయిలో చులకన చేశారు

Update: 2018-07-21 07:05 GMT

జనసేన పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుపై ఆయన ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘బీజేపీని వెనకేసుకోస్తే తమకు వచ్చే లాభమంటి..? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు. అలాంటి పార్టీతో పొత్తు ఎవరైనా పెట్టుకుంటారా.? వెనకేసుకొస్తారా..? బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను అంతే దారుణంగా దెబ్బకొట్టింది. ప్రజలను మోసం చేశారు. వంచించారు. కానీ, ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా మోసపోయినట్లుగా మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.’’ అని వ్యాఖ్యానించారు.

మీ అనుభవం ఎందుకు పనికొచ్చింది

‘‘మీ సుధీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ... మీ పార్టీ ఎన్ని రకాలుగా మాట మార్చారో మీకు తెలియంది కాదు. తద్వారా ఏపీ ప్రజలను నిలకడలేని వాళ్లుగా, అవకాశవాదులుగా, ఆత్మగౌరవం లేనివాళ్లుగా దేశస్థాయిలో నిలబెట్టారు’’ అని పవన్ ట్వీట్ చేశారు. ఓవైపు టీడీపీ ఎంపీలు బీజేపీని తిడుతూ ఇంకోవైపు బీజేపీ కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. వారు చేసేది ధర్మమైన పోరాటం అని ఎలా నమ్ముతామన్నారు. మళ్లీ వారి అవసరాల కోసం వైఖరి మార్చుకోరన్న నమ్మకం ఏంటి ప్రశ్నించారు.

Similar News