రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే..!

Update: 2018-10-24 14:04 GMT

రాజకీయాల్లో రాణించాలంటే అందులో ఫాదర్ గానీ.. గాడ్ ఫాదర్ గానీ ఉండాలని, తనకు వీరెవరూ లేరని, దేవుడి దిక్కని బీజేపీ నాయకులు పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఆయన పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనను సన్మానించి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. ఆథ్మాత్మిక కార్యక్రమాల్లో బాగంగా తాను అనేక ప్రాంతాల్లో బస్తీలు, మత్య్సకార గ్రామాల్లో పర్యటించానని, అక్కడ బడుగుల జీవితాలు చాలా దయనీయ పరిస్థితిలో ఉండటం చేసి చలించిపోయానని తెలిపారు. వీరి జీవితాల్లో మార్పు తేవాలంటే కేవలం ఆధ్యాత్మిక మార్గం ద్వారా, ప్రవచనాల ద్వారా సాధ్యం కాదని, ఓ రాజకీయ వేదిక అవసరమనే ఉద్దేశ్యంతోనే వచ్చానని తెలిపారు. తన తల్లిదండ్రులు, గురువుల సూచన తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, ఆరెస్సెస్ కృషితోనే భారతీయ జనతా పార్టీలో చేరానని ఆయన స్పష్టం చేశారు. తన శక్తిమేర పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. అంతకుముందు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు నిర్వహించారు.

Similar News