బ్రేకింగ్ : నిమ్మగడ్డకు సీఎస్ ఘాటు లేఖ

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. కరోనా అదుపులోకి రాలేదని పేర్కొన్నారు. గ్రామీణ [more]

Update: 2020-11-18 02:19 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. కరోనా అదుపులోకి రాలేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. పోలీసులు, జల్లా అధికారులు కరోనా కట్టడి కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని సీఎస్ నిమ్మగడ్డకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా అధికారులతో తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ సాధ్యం కాదని తెలిపారు. ఈ మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ సాధ్యం కాదని పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమర్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News