నిమ్మగడ్డ నిర్ణయం.. అక్కడ ఎన్నికల నిలిపివేత

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని ఏడో వార్డు ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ నిలిపివేశారు. తన నామినేషన్ ఫోర్జరీ సంతకంతో [more]

Update: 2021-03-05 01:07 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని ఏడో వార్డు ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ నిలిపివేశారు. తన నామినేషన్ ఫోర్జరీ సంతకంతో ఉపసంహరించారని ఆ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి ఫిర్యాదుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. దీంతో ఆ ఎన్నికను సస్పెండ్ చేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. విచారణ పూర్తయిన తర్వాత అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగేది నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News