కర్ఫ్యూలో వాళ్లు తప్ప బయటకు వస్తే?

తెలంగాణలో నిన్న రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.. కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం [more]

Update: 2021-04-21 00:50 GMT

తెలంగాణలో నిన్న రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.. కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది . ప్రజలు తప్పనిసరిగా తమ ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కేవలం అనుమతి ఉన్నవారే రోడ్లపైకి రావాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు. పరిస్థితిని బట్టి పాస్ లను మంజూరు చేస్తామని, ప్రభుత్వం అనుమతించిన వారు విధిగా తమగుర్తింపు కార్డులను చూపాల్సి ఉంటుందని సజ్జనార్ కోరారు.

Tags:    

Similar News