దుర్గమ్మ దర్శనానికి కొత్త రూల్… నేటి నుంచే అమలు

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అధికారులు కొత్త నిబంధన తీసుకువచ్చారు. ఇక నుంచి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు సంప్రదయ దూస్తుల్లోనే రావాలని, ఫ్యాషన్ దుస్తుల్లో వస్తే అనుమతి ఉండదని [more]

Update: 2019-01-01 06:39 GMT

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అధికారులు కొత్త నిబంధన తీసుకువచ్చారు. ఇక నుంచి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు సంప్రదయ దూస్తుల్లోనే రావాలని, ఫ్యాషన్ దుస్తుల్లో వస్తే అనుమతి ఉండదని ప్రకటించారు. పురుషులు షర్ట్, ప్యాంట్ లేదా పంచె, లుంగీ ధరించి దర్శనానికి రావాలి. మహిళలు పంజాబీ డ్రస్సు, తప్పనిసరిగా చున్నీ ధరించాలని లేదా చీరలు, లంగా ఓణి ధరించాలని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా సంప్రదాయ దుస్తుల్లో రాకపోతే వారికి ప్రత్యేక కౌంటర్ లలో సంప్రదాయ దుస్తులు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడే సంప్రదాయ దుస్తులు కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News