జగన్ జయం ఖాయమన్న ఎన్డీటీవీ

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకొని [more]

Update: 2019-05-19 13:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వేలో తెలింది. జనసేన ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని చెప్పింది. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది.

తెలంగాణలో టీఆర్ఎస్….

తెలంగాణలో మరోసారి గులాబీ పార్టీ హవా ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. టీఆర్ఎస్ పార్టీ 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలుచుకోవచ్చని ఈ సర్వేలో తేలింది. ఎంఐఎం ఒక సీటులో గెలుస్తుందని ఎన్టీటీవీ సర్వేలో అంచనా వేసింది.

Tags:    

Similar News