నాయినికి నిజంగా కోపం వచ్చిందా?

మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి కేసీఆర్ వైఖరి పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఆయన తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. తనకు మంత్రి పదవి [more]

Update: 2019-09-10 02:11 GMT

మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి కేసీఆర్ వైఖరి పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఆయన తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ మాట తప్పారని నాయని నరసింహారెడ్డి నేరుగా మాట్లాడటం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చినా అవసరం లేదని నాయని నరసింహారెడ్డి కుండబద్దలు కొట్టేశారు. గత ఎన్నికల్లోనూ తనకు టిక్కెట్ ఇవ్వలేదని, తన అల్లుడికి టిక్కెట్ ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని నాయని అన్నారు. తాము గులాబీ పార్టీకి ఓనర్లమని, కిరాయి దారులు ఎంతకాలం ఉంటారో తెలియదని నాయని అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News