జగన్ రెడ్డి లిక్కర్ మాఫియా కోరలు చాచింది

మద్యం షాపులను తెరిచి ఉంచడం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నా మద్యం షాపుల తెరచి [more]

Update: 2020-07-18 06:12 GMT

మద్యం షాపులను తెరిచి ఉంచడం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నా మద్యం షాపుల తెరచి ఉంచడమేంటని ప్రశ్నించారు. జగన్ కు కేవలం ధనాన్ని సంపాదించుకోవడమే తెలుసునని, ప్రజారోగ్యం పట్టదని నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి లిక్కర్ మాఫియా కోరలు చాచిందని, కరోనా బారిన పడి వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా జగన్ రెడ్డి ధనదాహం మాత్రం తీరడం లేదన్నారు. మద్యం షాపులు తెరచి 25 వేల కోట్ల జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని నారా లోకేష్ విమర్శించారు.

Tags:    

Similar News