బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుకు షాక్….!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా దేశంలోని విపక్షాలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. యాభై శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాలని తెలుగుదేశం పార్టీతో సహా విపక్షాలు సుప్రీీంకోర్టులో రివ్యూ [more]

Update: 2019-05-07 05:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా దేశంలోని విపక్షాలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. యాభై శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాలని తెలుగుదేశం పార్టీతో సహా విపక్షాలు సుప్రీీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చంద్రబాబునాయుడు ఈ రివ్యూ పిటీషన్ హియంరింగ్ పై ఢిల్లీ వెళ్లారు. విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని వాదోపవాదాలు విన్నారు. ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని, వీవీప్యాట్ లను యాభై శాతం లెక్కించాలని విపక్షాలు సుప్రీంకోర్టులో రివ్యూపిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీవీ ప్యాట్ లను లెక్కించాలంటే వారం రోజుల సమయం పడుతుందని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ రివ్యూ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందని న్యాయవాది సింఘ్వీ తెలిపారు.

Tags:    

Similar News