భర్తను చంపి..రాసలీలల్లో మునిగి..!

Update: 2018-08-09 10:49 GMT

పిల్లలు దేవుళ్లు అంటారు. వాళ్లు అమాయకంగా చెప్పిన ఓ నిజం నిందితుడ్ని పట్టుకునేలా చేసింది. తల్లి చేసిన దారుణానికి తాము సాక్ష్యులుగా మిగులుతామని తెలియని పిల్లలు అసలు నిజాన్ని చేప్పేశారు. అప్పటిదాకా పోలీసులను, మీడియాను ఏమార్చి అద్భుతమైన కట్టు కధ అల్లేసింది ఆ మహిళ. నిజమని నమ్మేలా చేసింది. కానీ పిల్లలు ఇచ్చిన క్లూతో గుట్టు రట్టైంది. ఓ దారుణమైన హత్యలో వెలుగు చూసిన వాస్తవాలు విస్తుగొలిపేలా ఉన్నాయి.

నటనతో నమ్మించినా...

హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇటీవల బానోతు జగన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సైదప్ప బస్తీలో తెల్లవారుజామున ఇంటి ముందు గేటు శబ్ధం రావడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారన్న అనుమానంతో ఇంటి యజమానులు పై అంతస్తుకు వెళ్లి చూడగా జగన్ చనిపోయి ఉన్నాడని, ఆ సమయంలో అక్కడే మరో వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడని భార్య దేవికని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పిందని, దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారిస్తే అసలు నిజం బైటపెట్టింది ఆ ఇల్లాలు. తాను చాలా టార్చర్ పడుతున్నాను అని పిల్లల కోసం అన్నీ భరించానని.. ఇద్దరం కలిసి చనిపోదాం అంటూ వేధించేవాడని.. తనపై దాడి చెయ్యడంతో తట్టుకోలేక పిల్లలను కిందకు పంపి చంపేశాను అని చెప్పింది. అలా అందర్నీ నమ్మించింది. పోలీసులకూ అదే చేప్పింది.

పిల్లలు క్లూ ఇవ్వడంతో...

అయితే, పోలీసులకు ఎక్కడో కొంత అనుమానం ఏర్పడింది. దీంతో అక్కడ సిసి కెమెరాలో ఫుటేజ్ కూడా చూసారు కాని ఎవ్వరు అనుమానితులూ కనిపించ లేదు. మెల్లిగా పిల్లలని విచారించారు. ఇంకో వ్యక్తి కూడా ఇంటికి వచ్చాడని పిల్లలు చెప్పారు. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. మృతుని తల్లిదండులను కూడా విచారిస్తే.. ఓ కరుడుగట్టిన వాస్తవం బైటికొచ్చింది. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన తోట బెనర్జి ఫిలింనగర్‌ లోని ఓ బీపీఓలో లైజన్‌ ఆఫీసర్‌ గా పని చేస్తూ దేవికతో పరిచయం పెంచుకున్నాడు. నీ అందం నన్ను పిచ్చొడిని చేసింది అంటూ కబుర్లు చెప్పాడు. అన్నీ నిజం అని నమ్మిన దేవిక బెనర్జితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏడాది క్రితం దేవిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, ఆమెను పెళ్లాడతానని బెనర్జీ చెప్పగా, వారు ఆగ్రహంతో బెనర్జీ పనిచేసే కంపెనీ దగ్గరకు వచ్చి మరీ దేహశుద్ధి చేశారు. ఆ తరువాత కూడా బెనర్జీ, దేవిక కలుస్తుండే వారు. విషయం తెలిసిన జగన్, పలుమార్లు భార్యను వారించినా, ఎప్పటికప్పుడు ఆయన కళ్లు గప్పి జగన్ వద్దకు వెళుతుండేది దేవిక. తామిద్దరమూ కలసి ఉండాలి అంటే జగన్ ను అడ్డు తప్పించుకోచాలి అని నిర్ణయించుకొని స్కేచ్ వేసుకొని.. ప్లాన్ అమలు చేశారు.

ఇంటిపైనే అద్దెకు దిగి...

ఇద్దరు కలుసుకోవాడనికి వీలుగా జగన్ దంపతులు అద్దెకున్న ఇంటి పెంట్ హౌస్ లోకి రెంట్ కు దిగాడు బెనర్జీ. జగన్ ను చంపేందుకు అవకాశా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో జగన్ నిద్రిస్తున్న వేళ, అతని మర్మాంగాలను దేవిక గట్టిగా పిసకగా, బెనర్జీ ఛాతీపై కూర్చున్న బెనర్జీ, గొంతును నులిమి హత్య చేశాడు. దాదాపు అరగంట పాటు ఈ హత్యాకాండ సాగగా, మధ్యలో పిల్లలు నిద్రలేవడంతో వారిని బాత్ రూంలో వేసిన దేవిక బయట గడియపెట్టింది. జగన్ చనిపోయాడని నిర్దారించుకున్న తరువాత పూటుగా మద్యం తాగిన ఇద్దరూ రాసలీలలు ఆడారు. ఆపై గంట సేపటి తరువాత బెనర్జీ వెళ్లిపోగా, తన సోదరుడికి ఫోన్ చేసిన దేవిక, బావ చనిపోయాడని చెబుతూ, చేతులకు గాయాలు చేసుకుంది. అందర్ని చివరకు మీడియాను కూడా తన నటనా చాతుర్యంతో అబద్దాన్ని నిజం అనేలా నమ్మించింది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Similar News