మోదీ కారెక్కగానే ఏం చేస్తారో తెలుసా..?

Update: 2018-08-22 10:05 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెందిన స్ఫూర్తిదాయక వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియో వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు దోహదపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు వీడ్కోలు చెప్పి కారు ఎక్కి కూర్చోగానే ముందు సీటు బెల్టు పెట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

అవగాహనకు కల్పించేందుకు...

కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రయాణికుల్లో అవగాహన కోసం చేపడుతున్న ‘సడక్ సురక్షా జీవన్ రక్షా’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ వీడియోను విడుదల చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్టు ధరించి ఉంటే 45-60 శాతం ప్రాణాపాయం తప్పుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. గత సంవత్సరం మారుతీ సుజుకి సంస్థ చేసిన ఓ సర్వేలో దేశంలో 25 శాతం కారు ప్రయాణికులు మాత్రమే సీటు బెల్టు పెట్టుకుంటున్నారని తేలింది. ప్రధానిని చూసైనా కొంతమంది సీటు బెల్టు పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే సంతోషం.

 

Similar News