బ్రేకింగ్ : బొత్స బాంబు పేల్చారే

రాజధాని నిర్మాణం విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో పోలిస్తే అమరావతిలో నిర్మాణవ్యయం ఎక్కువని చెప్పారు. అమరావతిలో ఫ్లై ఓవర్లు, [more]

Update: 2019-08-20 11:55 GMT

రాజధాని నిర్మాణం విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో పోలిస్తే అమరావతిలో నిర్మాణవ్యయం ఎక్కువని చెప్పారు. అమరావతిలో ఫ్లై ఓవర్లు, భారీ కట్టడాలను నిర్మించాల్సి ఉంటుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇతర ప్రాంతాల్లో అయితే నిర్మాణ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఇటీవల సంభవించిన వరదల్లో అమరావతి ప్రాంతంలో ఎక్కువగా ముంపునకు గురయ్యాయయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అమరావతిలో నిర్మాణం చేపడితే ఎక్కువగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. రాజధాని నిర్మాణంపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

Tags:    

Similar News