ప్రియురాలిపై కసి...ఇంతపని చేసిందా?

Update: 2018-05-16 02:48 GMT

ప్రియురాలి మీద కసి.. ప్రేమించేందుకు ప్రియురాలు నిరాకరించింది. ప్రేమను ఒప్పుకొని ప్రియురాలిని చంపాలన కసి ..కేరళ నుంచి యాసిడ్ బాటిల్ తో హైదరబాద్ కు వచ్చాడు. నర్సుగా పనిచేస్తున్న ప్రియురాలితో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పాలక్కాడ్ కు పారిపొయిన కిరాతకుడిని వల పన్ని పట్టుకున్నారు పోలీసులు.

ప్రేమను నిరాకరించిందని.....

ఇద్దరిది ఒకే ఊరు...పొట్ట కూటి కొసం హైదరబాద్ కు ఆ యువతి వచ్చింది. యువతిని విపరీతంగా ప్రేమించాడు. తన ప్రేమను పాలక్యాడ్ లో వున్నప్పుడు వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ కుదరలేదు. కేరళ పాలక్కాడ్ కు చెందిన జీషా నర్సు గా పనిచేస్తుంది. కొద్ది పాటి చదువుకు చదువుకొని. హైదరబాద్ అపోలో ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్లుగా ఇక్కడే పనిచేస్తుంది. అయితే తనప్రేమికుడు గురించి ఆమె పట్టించుకొలేదు. తన పని తాను చేసుకుంటూ పొతుంది. రెండు రోజుల క్రితం పాలక్కాడ్ కు చెందిన ప్రవీణ్ హైదరబాద్ కు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తన ప్రియురాలిని వెతక్కుంటూ ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రి గేట్ దగ్గర మకాం వేశాడు. సాయంత్రం సమయంలో తన పని ముగించుకుని బయటికి వస్తున్న తరుణంలో తనను వివాహం చేసుకోవాలని జీషాను ప్రవిణ్ అడిగాడు. అందుకు జీషా నిరాకరించింది. తాను ప్రేమించ లేదని, వివాహం చేసుకోలేనని తేల్చి చెప్పింది. దీంతో కోపంతో ఊగిపొయిన ప్రవీణ్ తనతో తెచ్చుకున్న యాసిడ్ ను జీషా మీద పోసి పారిపోయాడు. యాసిడ్ దాడిలో గాయపడిన జీషాను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఎనిమిది బృందాలు వెళ్లి.....

కేరళ పారిపోయిన ప్రవీణ్ ను పట్టుకునేందుకు ఎనిమిది పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. పాలక్యాడ్ కు వెళ్లాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. తన ప్రేమను జీషా అంగీకరించకుంటే హతమార్చాలనే ప్రవీణ్ ఇక్కడకు వచ్చాడు. అక్కడ పెయింటర్ గా పనిచేసిన ప్రవీణ్ అక్కడే యాసిడ్ కొనుగోలు చేసుకుని వచ్చాడు. యాసిడ్ దాడి చేసిన వెంటనే పారిపోయి పాలక్యాడ్ లోని అడవుల్లో దాక్కున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. జీషా కోలుకుంటోందని వైద్యులు చెప్పారు.

Similar News