కిడారి హత్యపై కన్నా సంచలన వ్యాఖ్యలు

Update: 2018-09-24 06:02 GMT

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టులు హతమార్చిన ఘటనపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ఇంటలిజెన్స్ ను తెలంగాణ ఎన్నికల కోసం ఉపయోగించడం వల్లనే కిడారి పై దాడి ఘటనను పోలీసులు ముందుగా పసిగట్టలేకపోయారన్నారు. కేవలం చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసమే పోలీసులను, ఇంటలిజెన్స్ ను వాడుకుంటున్నారన్నారు. 2014 తర్వాత ఏపీలో పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు చెలరేగిపోవడానికి ఇంటలిజెన్స్ వైఫల్యమే కారణమని కన్నా తెలిపారు.

Similar News