ప్రతి పౌరుడి ప్రొఫైల్ తయారు చేయండి

ఈసారి కూడా సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తామని తెలంగాణ ముఖ్యమత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం, పాలమూరు, దిండి, సీతారామ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. కోటి [more]

Update: 2018-12-29 11:37 GMT

ఈసారి కూడా సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తామని తెలంగాణ ముఖ్యమత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం, పాలమూరు, దిండి, సీతారామ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంతో పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ప్రతి పౌరుడి ప్రొఫైల్ ను తయారు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయాలని కోరారు. వైద్య, విద్య రంగాలకు ఈసారి అధికప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్టా? లేక పూర్తి స్థాయి బడ్జెట్టా అనేది అధ్యయనంచేయాలన్నారు. కంటివెలుగు కార్యక్రమంనిర్వహణ సంతృప్తికరంగా జరుగుతుందన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన అధికారులతో సమీక్షించారు.

Tags:    

Similar News