బ్రేకింగ్: సీఎంగా అయిన రెండో రోజే కీలక నిర్ణయం...?

Update: 2018-12-14 04:54 GMT

ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈరోజు తన తనయుడు కె.టి.రామారావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అత్యంత నమ్మకస్థుడు, సమర్ధుడికే పార్టీ పగ్గాలీు అప్పగించానని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమల్లోకి తేవడం తన బాధ్యత కావడంతోనే కేటీఆర్ కు పార్టీ బాధ్యతలను అప్పగించానని కేసీఆర్ వెల్లడించారు. తాను జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాల్సి ఉన్నందున కేటీఆర్ ఇక పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలను చూసుకుంటారన్నారు.

Similar News