విపక్షాలకు కేసీఆర్ వార్నింగ్… చూస్తూ ఉరుకునేది లేదు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా [more]

Update: 2021-02-10 12:37 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హాలియా బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అని కేసీఆర్ అన్నారు. తాము తలచుకుంటే కాంగ్రెస్ మిగలదని కేసీఆర్ తెలిపారు. కొత్త బిచ్చగాడు పొద్దెడరగడన్న సామెతగా ఉంది బీజేపీ పరిస్థితి అని కేసీఆర్ చమత్కరించారు. తమకు ప్రజలు తీర్పు ఇస్తేనే అధికారంలోకి వచ్చామని, ఇష్టానుసారంగా మాట్లాడితే తొక్కి పడేస్తామని హెచ్చరించారు కేసీఆర్. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News