కత్తి మళ్ళీ ఎక్కుపెట్టారే ...!! ?

Update: 2018-12-23 02:51 GMT

పవన్ ఫ్యాన్స్ వెర్సెస్ కత్తి మహేష్ పోరాటం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అటు అభిమానులు ఇటు సినీ క్రిటిక్ కత్తి సాగించిన యుద్ధం కొంత కాలంగా కనుమరుగు అయ్యింది. ఇప్పుడు ఎపి లో ఎన్నికల వేడి క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ మరోసారి కత్తి దూశారు. ఈసారి ఆయన వెరైటీగా పీకేకు సలహా ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. కత్తి చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తమదైన శైలిలో ఆయనపై విరుచుకుపడుతున్నారు.

అలాంటి వారిని కాదు... వీరి సంగతి చూడండి ...

కత్తి తాజాగా చేసిన కామెంట్ల లో ఏమన్నారంటే ..? నాదెండ్ల మనోహర్, రావేల కిషోర్ బాబు లు కాదు జనసేనను కాపాడేది. వాళ్ళు బెటర్ ఛాన్స్ లు వస్తే జంప్ అయిపోతారు. అదను చూసుకుని వెన్నుపోట్లు పొడిచేస్తారు. దిలీప్ సుంకర, విష్ణు నాగిరెడ్డి లాంటి పవన్ కళ్యాణ్ పిచ్చోళ్ళే జనసేనకు రక్ష. వారికి సరైన స్థానం కల్పించలేకపోతే పవన్ కళ్యాణ్ అంత లూజర్ మరొకరు వుండరు. ఇది కత్తి అన్న వ్యాఖ్యలు. ఈ వ్యాఖలు ఇప్పుడు మరోసారి పవన్ ఫ్యాన్స్ లో ఆగ్రహం కల్గించాయి. తమ పార్టీలో ఎవరు ఉండాలో వాళ్ళు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేది పవన్ కళ్యాణ్ కానీ కత్తి వంటి వారు కాదని ఎదురు దాడి చేశారు. ఇటీవల విష్ణు నాగిరెడ్డి జనసేన వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీడియో లు పోస్ట్ చేశారు. దాంతో నిత్యం టివి డిబేట్ లలో తనపై దాడి చేసే మిత్రులు దిలీప్ సుంకర, విష్ణు నాగిరెడ్డిలపై సానుభూతి చూపించారు కత్తి. మొత్తానికి కత్తి మరోసారి జనసేన పై పడటం చర్చనీయాంశమే అయ్యింది

Similar News