చెన్నైలో ఏం జరుగుతోంది..?

Update: 2018-08-07 10:53 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. వైద్యానికి ఆయన శరీరం స్పందించడం లేదని నిన్న కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో తమిళనాట తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రికి పెద్దఎత్తున కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు. కరుణ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే, నిన్నటితో పోలిస్తే ఇవాళ కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించిందని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా అలెర్ట్..

కరుణ కుటుంబసభ్యులంతా ఆసుపత్రికి చేరుకోవడం, స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పళినిస్వామిని కలవడం, రాష్ట్ర డీజీపీ అన్ని జిల్లాల పోలీసు అధికారులను అలెర్ట్ చేయడం వంటి పరిణామాలు చూస్తుంటే ఏ క్షణంలో ఏమి జరుగుతోందోనని ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, మరికొద్దిసేపట్లో కరుణ ఆరోగ్య స్థితిపై కీలక హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం కనిసిస్తోంది.

Similar News