కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ పరమేశ్వరన్ ను కాంగ్రెస్ ఎంపిక చేసింది. కర్ణాటకలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన దళిత వర్గానికి చెందిన వ్యక్తి. బుధవారం ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటే డిప్యూటీ సీఎంగా పరమేశ్వరన్ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మిగతా మంత్రివర్గాన్ని త్వరలో ఏర్పాటుచేయనున్నారు.