కర్ణాటకలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్...

Update: 2018-05-15 05:02 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇంచుమించు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందునుంచి అనుకున్నట్లుగానే ఏ పార్టీకి అధికారం చేపట్టేందుకు కావాల్సిన సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకావాలు కనపడటం లేదు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నా కూడా అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీ మాత్రం దక్కడం డౌటే. మరోవైపు బీజేపీ తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్ జేడీఎస్ తో కలిసి అధికారం పంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్, ట్రబుల్ షూటర్ గా పేరున్న గులాం నబీ ఆజాద్ తో పాటు అశోక్ గెహ్లాట్ కూడా కర్ణాటకలో తిష్ట వేసి జేడీఎస్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. దేవెగౌడ చెప్పిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తొంది. ఇక, బీజేపీ మాత్రం తమకు సంపూర్ణ మెజారిటీ వస్తుందని, తామే అధికారం కైవసం చేసుకుంటామనే నమ్మకంతో ఉంది.

Similar News