బిగ్ బ్రేకింగ్ : మరో బిగ్ వికెట్ అవుట్.. మధ్యాహ్నం జగన్ సమక్షంలో?

తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగలనుంది. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం టీడీపీకి రాజీనామా చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం ఆయన వైఎస్ జగన్ [more]

Update: 2020-03-12 06:38 GMT

తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగలనుంది. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం టీడీపీకి రాజీనామా చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీని వీడుతున్నట్లు కరణం బలరాం చెప్పారు. చీరాలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ గాలిలోనూ తనను చీరాల గెలిపించినట్లు తెలిపారు. చీరాల ప్రజలకు న్యాయం చేసేందుకే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన చెప్పారు. బలరాం వెంట మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరనున్నారు. అయితే కరణం బలరాం కండువా కప్పుకోకుండా వల్లభనేని వంశీ బాటలో పయనించే అవకాశముంది.

Tags:    

Similar News