బ్రేకింగ్ : బిఫారాలిచ్చేశారు

Update: 2018-11-11 12:48 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన పార్టీ అభ్యర్థులకు బిఫారాలు ఇచ్చేశారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులకు ఒక రోజు ముందుగానే కేసీఆర్ బిఫారాలు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో గజ్వేల్ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో వారు అనుసరించాల్సిన పంథాను విడమర్చి చెప్పారు.

త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు.....

అనంతరం సాయంత్రం ఫాంహౌస్ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ తొలుత ప్రకటించిన 107 మంది అభ్యర్థులతో సమావేశమయ్యారు. నామినేషన్లు వేసే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో రెండు దఫాలుగా ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం మూడోసారి ప్రచారానికి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తాను కూడా నియోజకవర్గాల వారీగా పర్యటిస్తానని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి తన పర్యటనలుంటాయన్నారు.

Similar News