ఆ 105 మంది అభ్యర్థులతో కేసీఆర్...?

Update: 2018-09-06 14:17 GMT

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రకటించిన 105 మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వారితో మాట్లాడారు. టిక్కెట్ వచ్చిందన్న ధీమాతో అతివిశ్వాసానికి పోవద్దని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. రేపటి నుంచే నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాలను వెంటనే ఖాళీ చేయాలన్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని స్థాయిల్లో ఉన్న నేతలను కలుపుకుని వెళ్లాలని, అసంతృప్తిగా ఉన్న నేతలను మీరే బుజ్జగించాలని తెలిపారు. తాను ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటానని, ప్రచారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని చెప్పారు. తనకు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నివేదికలు అందుతుంటాయని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. మరోసమావేశంలో కలుద్దామని కేసీఆర్ అభ్యర్థులకు తెలిపారు.

Similar News