నమ్మితే శంకగిరి మాన్యాలే

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం పన్నుల్లో తెలంగాణ వాటా తగ్గించడం దారుణమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రావాల్సిన 3,731 కోట్లను [more]

Update: 2020-02-01 14:18 GMT

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం పన్నుల్లో తెలంగాణ వాటా తగ్గించడం దారుణమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రావాల్సిన 3,731 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎగవేసిందన్నరాు. రావాల్సిన 1,137 కోట్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదన్నారు. రాష్ట్రాలకు వాటా తగ్గించడం కేంద్రం అసమర్థత అని కేసీఆర్ అన్నారు. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలు వెళ్లక తప్పదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో పట్టణాభివృద్ధికి కూడా కోత పడిందన్నారు. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు నిధులు తగ్గించారన్నారు. కేంద్ర బడ్జెట్ వల్ల తెలంగాణపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు.

Tags:    

Similar News