వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చంద్రబాబు బంధువు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ముఖ్యమంత్రి [more]

Update: 2019-02-28 06:45 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధువుల నార్నె శ్రీనివాసరావు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. లోటస్ పాండ్ లో పార్టీ అధినేత జగన్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నార్నె వైసీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాను పార్టీలో చేరడానికి, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదని నార్నె పేర్కొన్నారు. తాను ఏ స్థానాన్నీ ఆశించడం లేదని, జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని, అందుకే పార్టీలో చేరానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News