జేసీ జోస్యం..జగన్ జైలుకెళ్లేది ఎప్పుడంటే?

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలే చేస్తుంటారు. ఆయన మరోసారి జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్ మార్చి 20వ తేదీ [more]

Update: 2020-02-02 03:00 GMT

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలే చేస్తుంటారు. ఆయన మరోసారి జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్ మార్చి 20వ తేదీ లోపు జైలు కెళతారని జోస్యం చెప్పారు. ఈ విషయాన్ని తనకు ఒక స్వామీజీ చెప్పాడని కూడా జేసీ దివాకర్ రెడ్డి చెప్పడం విశేషం. అందుకు డెడ్ లైన్ కూడా పెట్టారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ లోపు జగన్ జైలు కెళ్లడం ఖాయమన్నారు. అయితే తనకు ఈ విషయాన్ని చెప్పిన స్వామీజీ పేరును మాత్రం జేసీ దివాకర్ రెడ్డి చెప్పలేదు. జగన్ కు ఉన్న అహంకారం ఆయననే అణిచివేస్తుందన్నారు. జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని, అందుకే అతని మనస్తత్వం తనకు తెలుసునని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News