Jc divakar reddy : ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తా.. జేసీ కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీకి  సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. ఏపీని వదిలేసి తెలంగాణకు రావాలను కుంటున్నానని జేసీ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకే తాను [more]

Update: 2021-09-24 07:24 GMT

తెలంగాణ అసెంబ్లీకి సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. ఏపీని వదిలేసి తెలంగాణకు రావాలను కుంటున్నానని జేసీ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలవలేకపోయారు. మంత్రి కేటీఆర్ ను జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. తర్వాత కాంగ్రెస్ శాససభ పక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. జానాారెడ్డి ఓడిపోతానని తాను ముందే చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజాలు బాగా లేవని జేసీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News