అసద్ కు కృతజ్ఞతలు చెప్పిన జగన్

ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎంఐఎం [more]

Update: 2019-04-04 12:59 GMT

ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎంఐఎం జెండాలతో ఆ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. దీంతో తనకు మద్దతు ఇస్తున్న అసదుద్దిన్ కు సభలో మాట్లాడుతూ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలు గెలుపోటములు ప్రభావితం చేసే చోట్ల స్థానికంగా ఎంఐఎం పార్టీకి చెందిన వారు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ కూడా ప్రకటించారు. వైఎస్ఆర్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకోవడంతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా ముస్లిం విద్యార్థులు చదువుకునేందుకు సహకరించినందున ముందునుంచీ వారు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. తన మిత్రుడు జగన్ కోరితే ప్రచారం కూడా చేస్తానని అసద్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News