బ్రేకింగ్: వైసీపీ కొత్త వ్యూహం ‘ ఇదే

ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా తటస్థులను తనతో కలుపుకునేందుకు ‘అన్న పిలుపు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో [more]

Update: 2019-01-24 08:41 GMT

ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా తటస్థులను తనతో కలుపుకునేందుకు ‘అన్న పిలుపు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తటస్థులుగా ఉన్న వారికి జగన్ నేరుగా లేఖలు రాయనున్నారు. కలిసి పనిచేద్దామని కోరనున్నారు. తర్వాత వారందరినీ కలిసి వారి సలహాలు సూచనలను తీసుకోనున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారని తెలుస్తోంది. గ్రామస్థాయి వరకు తటస్థులను వైసీపీ ఇప్పటికే గుర్తించింది. వారి పేరుతోనే జగన్ వారికి లేఖ రాస్తున్నారు. ఇందులో జగన్ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వారి సలహాలు, సూచనలు ఈ మెయిల్ ఐడీకి పంపించవచ్చు. మొత్తానికి ఎన్నికల వేళ జగన్ ఒక మంచి కార్యక్రమాన్నే చేపట్టారిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News