జగన్ కేసుపై బాబు ఈ నిర్ణయం తీసుకోనున్నారా?

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలన్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ [more]

Update: 2019-01-06 05:55 GMT

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలన్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వం జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని హైకోర్టు లో సవాల్ చేసే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. న్యాయపరమైన అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News