బ్రేకింగ్ : జేసీకి చంద్రబాబు ఫోన్

Update: 2018-09-17 02:36 GMT

తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోనంత వరకూ తాను ఆందోళన విరమించేది లేదని జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్నారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ బైఠాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడిపత్రి లో పరిస్థితిని జేసీ దివాకర్ రెడ్డికి ఫోన్ చేసి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ సంఘటన పూర్వపరాలను ఆయనకు వివరించారు. ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జేసీ చంద్రబాబును కోరారు. మరోవైపు తాడిపత్రిలో పరిస్థితిని చిత్తూరు, అనంతపురం ఎస్పీలు సమీక్షిస్తున్నారు.

Similar News